SruGK

ప్రపంచ దేశాల వివరాలు

ఖండాలు:

భూగోళంలో 71 శాతం జలావరణంచే కప్పబడి ఉండగా కేవలం 29శాతంలో మాత్రమే భూబాగం నెలకొని ఉంది. ఈభూభాగాన్ని 7 ఖండాలుగా విభిజించారు. అవి- 1. ఆసియా , 2. యూరోప్, 3. ఉత్తర అమెరికా, 4. దక్షిణ అమెరికా, 5. ఆఫ్రికా, 6. ఆస్ట్రేలియా, 7. అంటార్కిటికాలు. అటు విస్తీర్ణ పరంగానూ, ఇటు భూపరంగానూ కూడా ఖండాలలోకెల్లా పెద్ద ఖండమైన ఆసియా, ప్రపంచ భూవిస్తీర్ణం రీత్యా ప్రపంచంలోకెల్లా చిన్నఖండం. ఆస్ట్రేలియానే ద్వీపఖండం అని కూడా అంటారు. ఇక ఆఫ్రికాకు చీకటిఖండం అనిపేరు. ఆఫ్రికా ఖండాలలోకెల్ల ఆర్థికంగా వెనుకబడిన ఖండం. యూరోప్, ఉత్తర అమెరికాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఖండాలు. కాగా అంటార్కిటికా జనావాసానికి యోగ్యంకాని మంచు ఖండం. దక్షిణ అమెరికా అంతా లాటిన్ అమెరికన్ దేశాల మయం. ఆఫ్రికా, ఆసియాలను ఎర్రసముద్రం వేరుచేస్తుండగా, ఆఫ్రికా, యూరోప్ లను మధ్యదరా సముద్రం వేరుచేస్తున్నది. ఇక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖాండాలను, అట్లాంటిక్ మహాసముద్రం యూరోప్, ఆఫ్రికా ఖండాల నుండి వేరుచేస్తున్నది. ఆసియా, అమెరికా ఖండాలను పసిఫిక్ మహాసముద్రం వేరుచేస్తున్నది.

భౌగోళిక సముదాయాలు:

ప్రపంచంలోని వివిధ దేశాల్ని కలిపి ఒక సహజ భౌగోళిక సముదాయంగా గుర్తించారు. వాటికి సంప్రదాయకంగా కొన్ని పేర్లు ఉన్నాయి. దానికి సంబంధియంచిన వివరణ ఇది.

ఉత్తర యూరోప్:

ఐరోపా ఖండంలోని ఉత్తర ప్రాంతం ఇది. నార్వే, స్వీడన్. ఫిన్లాండ్, లాత్వియా, లిథుయేనియా, ఐస్లాండ్, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్స్, ఎస్టొనియా దేశాలు ఈ ప్రాంతం కిందికి వస్తాయి. వీటిలో బ్రిటన్ ప్రాముఖ్యత ఎక్కువ. ఒకటి రెండు తప్ప మిగతావన్నీ అభివృద్ధి చెందిన దేశాలే.

మధ్య మరియు తూర్పు యూరోప్:

గతంలో సోవియట్ శిబిరానికి సన్నిహితంగా ఉన్న పోలాండ్, రుమేనియా, హంగరీ, జెకొస్లా వేకియా, స్లోవేకియాలతోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్లు ఈ ప్రాంతం కిందికి వస్తాయి. జెర్మనీ కూడా తూర్పు యూరోప్ లో అంతర్భాగమే. ఫ్రాన్స్, జెర్మనీ దేశాలు ఈ ప్రాంతంలో ఆధిక్య దేశాలు.

దక్షిణ యూరోప్:

గతంలో లాటిన్ అమెరికాను పాదాక్రాంతం చేసుకున్నా స్పెయిన్, ఇటలీ, గ్రీస్, బల్గేరేయా, మాసిడినియా, యుగోస్లోవియా, స్లోవేకియా,క్రొయేషియా, ఆల్బేనియాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

పశ్చిమాసియా / మధ్య ప్రాచ్యం:

యూరోపియన్ దేశంగా భావించే టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యోమెన్, ఒమన్, అర్మేనియాలు మధ్యప్రాచ్యం (లేదా) పశ్చిమ ఆసియాలోనివి. ఆర్మేనియాను కూడా ఈ పశ్చిమాసియాలో అంతర్భాగం అనే చెప్పుకోవాలి.

ఉత్తర ఆఫ్రికా:

ఆఫ్రికాలోని ప్రధానమైన దేశాలన్నీ ఈ విభాగం పరిధిలోకే వస్తాయి. మొరాకో, అల్జీరియా, ట్యూనీషియా, లిబియా, ఈజిప్ట్, మార్షియానా, మాలీ, నైగర్, చాద్, సూడాన్, ఎరిత్రియా, ఇథియోపియా, సోమాలియాలు ఉత్తరాఫ్రికాలోనివే.

మధ్య ఆఫ్రికా:

గినియా, సియోర్రాలియోన్ వంటి చిన్న దేశాలు, జైరే (కాంగో)వంటి పెద్దదేశం ఈ విభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ విభాగంలో కంపించేవి పెద దేశాలు. సెనెగల్,సిరియా, లైబీరియా, కోటె డిపోర్, బుర్కినా, ఫోసో, ఘనా, బెనిన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కామెరూన్, గబన్, జైర్, ఉగాండా, కీన్యా, టాంజానియాలు మధ్య ఆఫ్రికా దేశాలు.

దక్షిణాఫ్రికా ప్రాంతం:

ఈ ప్రాంతంలో ప్రముఖమైంది దక్షిణాఫ్రికా, వజ్రాల నిల్వలకు మరోపేరు దక్షిణాఫ్రికా దేశాలు. అంగోలా, జాంబియా, మాలవి, నమీబియా, బోట్స్వానా, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, లెసాథోలు ఈ విభాగంలోకి వస్తాయి.

రష్యా, పరిసర దేశాలు:

జార్జియా, బెలారస్, ఉక్రెయిన్, మాల్డోవా, రష్యాలు ఈ విభాగంలో ఉన్నాయి.

మధ్య ఆసియా:

ఈ ప్రాంతంలోని దేశాలు కూడా గతంలో సోవియట్ కు అనుబంధంగా ఉన్నవే. ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, తుర్క్మెనిస్థాన్, అజర్బైజాన్లను కలిపి మధ్య ఆసియాగా వ్యవహరిస్తారు.

భారత ఉపఖండం:

దక్షిణాసియా యావత్తూ భారత ఉపఖండం కిందకే వస్తుంది. పాకిస్థాన్, నేపాల్, భారత్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు భారత ఉపఖండంలోని భాగాలు.

ఆగ్నేయాసియా:

గతంలో వీటిని ఆసియన్ టైగర్లుగా వ్యవహరించే వారు. వైశాల్యంలో చిన్నవే అయినప్పటికీ సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆ బిరుదుకు కారణం. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్ ల్యాండ్, లావోస్,బ్రూనేల్ని ఆగ్నేయాసియా అంటారు.

ఆస్ట్రేలియా:

న్యూజిలాండ్, ఆస్టేలియా, పాపువా న్యూగినియాలు కలిపితే ఆస్టేలియా ప్రాంతం అవుతుంది.

దూరప్రాచ్యం:

చైనా ఈ ప్రాంతంలో ప్రాధాన్యదేశం. మంగోలియా, ఉత్తర, దక్షిణ కొరియాలు, జపాన్, తైవాన్, హాంగ్ కాంగ్ మిగిలిన దూర ప్రాచ్యదేశాలు.

ఉష్ట మండల దక్షిణ అమెరికా:

ఖండం చివరి భాగంలోని అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, చిలీ దేశాలు ఉష్ణ మండల దక్షిణ అమెరికా విభాగంలోకి వస్తాయి.

సమశీతోష్ణ దక్షిణ అమెరికా:

దక్షిణ అమెరికా ఖండంలోని ప్రముఖ దేశమైన బ్రెజిల్ తో పాటు బొలీవియా, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, గయానా, సురినాం, ఫ్రెంచ్ గయానా, ఈక్వెడార్లు సమశీతోష్ణ దక్షిణ అమెరికాగా పిలవబడతాయి.

మధ్య అమెరికా, కరేబియన్ దేశాలు:

ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉండే దేశాలన్నీ ఈ విభాగం కిందకి వస్తాయి. మెక్సికో, గ్వాటిమాలా, హొండురాస్, నికరాగ్వా, కొష్టారికా, పనామా, సాల్వడార్, క్యూబా, జమైకా, హైతీ, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికా వంటి చిన్న దేశాలెన్నో వీటిల్లో ఉన్నాయి.

లాటిన్ అమెరికా దేశాలు:

మధ్య, దక్షిణ అమెరికాలలోని రోమన్ భాషలు మాట్లాడే 33 స్వతంత్ర దేశాలు, 13 ఇతర రాజకీయ విభాగాలను కలిపి లాటిన్ అమెరికన్ దేశాలంటారు. ఈ దేశాలలో మాట్లాడే రొమాన్స్ భాషలలో స్పెయిన్ ఆధికం కాగా, బ్రేజీల్లో పోర్చుగీస్ను, హైతీలో ఫ్రెంచ్ భాషాను మాట్లాడతారు.

యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యు.ఎస్.ఎస్.ఆర్):

రష్యాలో 1917 జరిగిన కమ్యూనిస్టుల మహావిప్లవం, తదనంతరం జరిగిన అంతుర్యుద్ధం (1911-20) తర్వాత 1922లో 15 రిపబ్లిక్ ల కలయికతో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యు.ఎస్.ఎస్.ఆర్.) ఆవిర్భవించింది. 1929లో ప్రపంచ ఆర్థికమాంద్యం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఘోర సంక్షోభంలో పడినప్పటికీ సోవియట్ యూనియన్ మాత్రం తన ప్రణాళికా బద్ద ఆర్థిక వ్యవస్థతో ముందుకు పురోగమించడంతో యూరప్ లోని ఇతర దేశాలకూ కమ్యూనిజం వ్యాపించింది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు ధీటుగా యు.ఎస్.ఎస్.ఆర్. అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. అమెరికాతో రక్షణ, అంతరిక్ష రంగాలలో పోటీపడ్డ యు.ఎస్.ఎస్.ఆర్. ఆర్థికంగా చితికిపోవడంతో 1991లో విడిపోయి 15 రిపబ్లిక్ కన్లుగా విడిపోయింది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత రిపబ్లిక్ కన్లలలో 12 రిపబ్లిక్ కన్లు కలిపి కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సి.ఐ.ఎన్)గా ఏర్పడ్డాయి.

యుగోస్లోవియా (సెర్తియా మొంతేనీగ్రో):

ఆగ్నేయ యూరప్ లో ఆడ్రియాటిక్ సముద్రంచే అవరింపబడి ఉన్న యుగోప్లోవియా 1919లో సెర్చియా, మోమ్త్రెనీగ్రో, క్రొయేషియా, స్లోవేకియా, బోస్నియా-హెర్జ్గోవినా అనే 5 ఫెడరిక్ల కలయిక వల్ల ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్దానంతరమ్ ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి జోసెఫ్ టిటో నాయకత్వం వహించారు. జోసెఫ్ టిటో అసమాన నాయకత్వం వల్ల వివిధ జాతుల మధ్య సంఘర్షణలు ఉన్నప్పటికీ యుగోస్లోవియా ఐక్యంగానే ఉండిపోయింది. జోసెఫ్ టిటో మరణం, అనంతర ఆర్థిక సంక్షోభం చివరగా 1991లో సోవియట్ పతనం వెరసి యుగోస్లోవియాలో భయానక అంతర్యుద్దానికి దారితీసింది. ఫలితంగా యుగోస్లోవియా ముక్కలై ఆరు చిన్నచిన్న రిపబ్లిక్కులుగా విడిపోయింది. ఆ రిపబ్లిక్కుల వివరాల ఇలా ఉన్నాయి.

యుగోప్లెవియా స్థానంలో పేర్చియా-మాంటెవీగ్రీ పేరుతో 2003 జూన్ లో కొత్తదేశం ఆవిర్భవించింది.

చేకొస్లోవేకియా

నాలుగు విభిన్న భౌగోళిక ప్రాంతాలైన భూహిమియా, మొరావియా, కార్పాథియన్ మరియు స్లోవేకియాల కలయికతో 1918లో చెకొస్లోవేకియా రిపబ్లిక్ గా అనతరించింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం చెకొస్లోవేకియా ప్రజాస్వామ్య విధానాన్ని అవలంభంచింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం రష్యా ప్రభావానికి లోనైన చెకొస్లోవేకియా కమ్యూనిస్టు తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టుల ఆధిక్యంలోకొచ్చిన తరువాత 1990 లో తొలిసారిగా దేశంలో జాతీయ ఎన్నికలు జరిగాయి. 1992లో స్లొవేనియన్లు సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడంతో చెకొస్లోవేకియా చెక్, స్లోవేకియా అనే రెండు రిపబ్లిక్కులుగా విడిపోయింది. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ కాగా, స్లోవేకియా రాజధాని బ్రతిస్లోవా.

జెర్మనీ

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ జెర్మనీ, తూర్పు జర్మనీలుగా విడగొట్టబడిన జెర్మనీ తిరిగి 1990లో ఐక్యజర్మనీగా ఆవిర్భవించింది. రెండవ ప్రపంచయుద్ధంలో జెర్మనీ ఓడిపోయిన తర్వాత యుద్ధంలో గెలిచిన మిత్రరాజ్యాలు జెర్మనీని పశ్చిమ జెర్మనీ, తూర్పు జెర్మనీలుగా విడగొట్టి రెండు జెర్మనీలను వేరుచేస్తూ బర్లిన్ గోడను నిర్మించాయి. పశ్చిమ జెర్మనీకి బాన్ రాజధాని కాగా, తూర్పు జెర్మనీకి బర్లిన్ నగరం రాజధాని అయ్యింది. రష్యా ప్రభావంతో తూర్పు జెర్మనీ కమ్యూనిజాన్ని చేపట్టగా, పశ్చిమ దేశాల ప్రభావంతో పశ్చిమ జెర్మనీ ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భావించింది. తూర్పు జెర్మనీని జెర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (జి.డి.ఆర్) అని, పశ్చిమ జెర్మన్య్ని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జెర్మనీ (FRG) అని పిలిచేవారు. 1990లో ఉభయ జెర్మనీలు బర్లిన్ గోడను కూల్చివేసి ఐక్య జెర్మనీగా ఆవిర్భవించాయి. ఐక్య జెర్మనీకి బాన్ రాజధాని నగరం అయ్యింది. అయితే ప్రస్తుత రాజధాని ‘బర్లిన్’.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు

1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తర్వాత జపాన్ ఆక్రమణలో ఉన్న కొరియాను, అమెరికా, సోవియట్ యూనియన్ ల సైన్యాలు ఆక్రమించాయి. కొరియాను ఐక్యం చేపేందుకు జరిగిన చర్చలు విఫలం కావడంలో 1948లో 38 ఉత్తర ఆంక్షన్ని ఉభయ కొరియాల సరిహద్ధుగా నిర్ణయిస్తూ ఉత్తర, దక్షిణ కొరియాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఉత్తర కొరియాలో కమ్యూనిష్టుల పాలన ఏర్పడగా 1950లో దక్షిణ కొరియా రిపబ్లిక్ గా ఆవతరించింది. 1950లో ఉభ్యయా దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం 1953లో జరిగిన తాత్కాలిక సంధితో ఆగిపోయింది. అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా ఉభయ కొరియాలు ఉద్రక్త వాతావరణంలోనే నివసిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక మంది సైనికులు కాపలా కాస్తున్న సరిహద్దుగా 38 ల ఉత్తర అక్షంశo పేరు తెచ్చుకున్నదంటే ఉభయ కొరియాల మధ్య ఉండే ద్వేషపూరిత వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కొరియాకు ప్యాంగ్ యాంగ్ రాజధాని కాగా, సియోల్ దక్షిణ కొరియాకు రాజధాని నగరంగా ఉన్నది.